క్రేజీ అప్డేట్.. ప్రభాస్ ‘ రామ్ గోపాల్ వర్మ

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’ . గ్లింప్స్‌తో భారీ అంచనాలు రేకెత్తించిన ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అతిథి పాత్రలో కనిపించనున్నారట. ఆయన పాత్రకు సంబంధించి షూటింగ్ అప్డేట్ అంటూ నెట్టింట ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

మరోవైపు కల్కిలో జక్కన్న రాజమౌళి కూడా నటిస్తున్నారంటూ కొన్నిరోజుల క్రితం ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఇప్పుడేమో ఆర్జీవీ.. ఇలా ఈ ఇద్దరు డైరెక్టర్లకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి చేశారట. అయితే, నిర్మాతలు మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ మూవీ వచ్చే ఏడాది మే నెలలో విడుదల అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన దీపిక పదుకొణె నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news