కోలీవుడ్ స్టార్ హీరో రాశిఖన్నా కి ఇచ్చిన ఆఫర్ తో నేలమీద నిలవడం లేదుగా ..!

-

రాశిఖన్నా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటినుంచి మంచి సక్సస్ ఫుల్ సినిమాలే చేసింది. ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ బ్యూటి మొదటి సినిమా సక్సస్ తో ఇండస్ట్రీ దృష్ఠిని బాగా ఆకర్షించింది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరం తేజ్, గోపీచంద్, రాం, ఎన్.టి.ఆర్, విజయ్ దేవరకొండ.. ఇలా టాలీవుడ్ లో స్టార్ హీరోలతో మంచి హిట్ సినిమాలలో నటించింది. ఇప్పటికి రాశీఖన్నా కి తెలుగులో మంచి పాపులారిటి ఉంది. మంచి రెమ్యూనరేషన్ కూడా అందుకుంటోంది. చెప్పాలంటే యంగ్ హీరోలందరికి మంచి ఛాయిస్ రాశిఖన్నా.. అన్న పేరుంది.

 

Digital service providers: Telugu Film Chamber of Commerce vs ...

అయితే ఈ చాలా కాలం నుండి రాశీఖన్నా కి తమిళ సినిమాలలో నటించాలన్న కోరిక అలాగే అక్కడ స్టార్ హీరోయిన్ అవ్వాలన్న ఆశతో ఉంది. ఆ దిశగా ఇంతకముందు ప్రయత్నాలు చేసింది. కాని ఎందుకనో కోలీవుడ్ నుండి అవకాశాలు రాలేదు. రెండు మూడు సార్లు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. అయినా పట్టు వదలకుండా రాశీఖన్నా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎట్టకేలకు ఒక గోల్డెన్ ఛాన్స్ అందుకుంది.

ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన రాశీఖన్నా ఛాన్స్ అందుకుంది. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళనుందట. ఈ అవకాశం రాగానే రాశీఖన్నా కాళ్ళు నేలమీద నిలబడటం లేదట. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పటికి రావడం అది కూడా సూర్య వంటి స్టార్ పక్క నటించే అవకాశం కావడంతో ఈ అమ్మడు ఎప్పుడెప్పుడు తమిళ పరిశ్రమలోకి అడుగుపెడతానా అంటూ ఆతృతగా ఉందట. ఇక తెలుగులో రీసెంట్ గా వచ్చిన రెండు సినిమాలలో ఒకటి విజయ్ దేవరకొండ సరసన నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ అవగా, సాయి ధరం తేజ్ సరసన నటించిన ప్రతీ రోజు పండగే సూపర్ హిట్టయింది. గతంలోను సాయి ధరం తేజ్ రాశీఖన్నా కలిసి నటించిన సుప్రీం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news