థియేట‌ర్ల‌లోకే వ‌స్తానంటున్న ర‌వితేజ‌.. ఖిలాడీతో దుమ్ములేపుతాడా?

-

మాస్ మ‌హారాజ మ‌ళ్లీ స‌క్సెస్ బాట ప‌ట్టాడు. వ‌రుస ప్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన ఈ హీరో ఈ ఏడాది క్రాక్ సినిమాతో దుమ్ము లేపాడు. క‌లెక్ష‌న్ల‌తో ఇండ‌స్ట్రీని షేక్ చేశాడు. దీంతో ఫుల్ జోష్‌తో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఖిలాడీలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొన్న‌టి వ‌ర‌కు యూర‌ఫ్‌లో జ‌రిగింది.

అయితే క‌రోనా కార‌ణంగా షూటింగ్‌ను నిలిపివేశారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తి క‌ర వార్త చెక్క‌ర్లు కొడుతోంది. ఇందులో మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తీ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను మొన్న‌టి వ‌ర‌కు ఓటీటీలో రిలీజ్ చేస్తార‌నే ప్ర‌చారం సాగింది. అయితే అదేం లేద‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లో థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత స‌త్యానారాయ‌ణ ప్ర‌క‌టించారు. అన్ని హంగుల‌తో ర‌వితేజ మాస్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాను రూపొందిస్తున్నట్టు వివ‌రించారు. త్వ‌రోల‌నే సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టిస్తామ‌ని వివ‌రించారు.

Read more RELATED
Recommended to you

Latest news