ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

-

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా చూసుకుంటాడు. అందుకే కిరణ్ సినిమా రిలీజ్ అవుతోంది అంటే కనీసం ఒక్కసారైనా మూవీ చూసేయచ్చని అభిమానులు భావిస్తుంటారు. కిరణ్ అబ్బవరం లేటెస్ట్​గా నటించిన సినిమా రూల్స్ రంజన్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

నేహా శెట్టి హీరోయిన్​గా… రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా .అక్టోబరు 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదికగా ఆహాలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ‘రూల్స్‌ రంజన్‌’ను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ఓటీటీ వేదిక తెలిపింది. ఈ సినిమాను దివ్యాంగ్‌ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మించారు. వెన్నెల కిషోర్‌, ఆది కామెడీ మాత్రమే సినిమాను కాస్త నిలబెట్టాయి.

Read more RELATED
Recommended to you

Latest news