సాయిధ‌ర‌మ్‌తేజ్ పుకార్ల‌కు చెక్ పెట్టేశాడా?  

-

సాయిధ‌ర‌మ్‌తేజ్ అనారోగ్యానికి గుర‌య్యాడ‌ని ఈ రోజు ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అంతే కాకుండా ఆయ‌నకు కోవిడ్ సోకి వుండ‌వ‌చ్చ‌ని, ఆ కార‌ణంగానే ఆయ‌న బ‌య‌టికి రాకుండా హోమ్ ఐసోలేష‌న్‌కే ప‌రిమితమ‌య్యారంటూ వార్త‌లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై స్పందించ‌ని సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌న కొత్త సినిమా ప‌నుల్లో బిజీగా వున్నాన‌ని ఓ ఫొటోని పోస్ట్ చేసి మ‌రీ వెల్ల‌డించాడు.

దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో సాయి ధ‌ర‌మ్‌తేజ్ ఓ మూవీ చేస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు ఈ మూవీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభ‌మైంది. అయితే క‌రోనా కార‌ణంగా రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం ఇంత వ‌ర‌కు స్టార్ట్ కాలేదు. త‌న 14వ సినిమా కోసం ఇంటెన్స్ ప్రిపరేషన్ పని ప్రారంభమైంది. దేవా క‌ట్టా గారు త‌న రైటింగ్‌తో సిద్ధం చేస్తున్నారు. సెట్స్‌లోకి వెళ్ల‌డానికి రెడీ అవుతున్నాం` అని ద‌ర్శ‌కుడు దేవా క‌ట్టా వున్న ఫొటోని షేర్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ ఫొటో చూసిన వారంతా సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌న హెల్త్ కండీష‌న్‌పై వ‌స్తున్న రూమ‌ర్‌ల‌కు చెక్ పెట్టార‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news