BRO రిలీజ్ వేళ.. హీరో తేజ్ ఎమోషనల్ పోస్టు

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన మల్టీస్టారర్ బ్రో-ది అవతార్. ఈ సినిమా ఇవాళ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో హీరో సాయి ధరమ్‌తేజ్‌ తన మామయ్య పవన్‌ కల్యాణ్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఓ ఎమోషనల్‌ పోస్టు చేశారు. పవన్‌ కల్యాణ్‌తో ఉన్న తన చిన్నప్పటి ఫొటోను పంచుకున్నారు. దానికి ‘‘అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి!’’ అని క్యాప్షన్‌ యాడ్ చేశారు.

‘ఈరోజు నా కల నిజమైంది. ‘‘ప్రస్తుతం నాలోని ప్రతి భావోద్వేగానికి అక్షర రూపం ఇవ్వాలని ఉంది. నా గురువు, మామయ్య, నా స్ఫూర్తి.. పవన్‌కల్యాణ్‌తో కలిసి స్క్రీన్ పంచుకునే అదృష్టం దక్కింది. నేను ఇప్పటికీ ఆయన చేయి పట్టుకున్న చిన్నపిల్లాడినే. నాపై నమ్మకం ఉంచి ఇంత గొప్ప సినిమాకు నన్ను ఎంపిక చేసిన తివిక్రమ్‌కు ధన్యవాదాలు. మీ వల్లే నా కల నిజమైంది. అలాగే సముద్ర ఖని, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, ‘బ్రో’ చిత్రబృందంలోని అందరికీ నా కృతజ్ఞతలు. అన్నిటికంటే ముఖ్యంగా నా ముగ్గురు మామయ్యలకు (చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌) వారి అభిమానులకు, సినీ ప్రియులకు అందరికీ ధన్యవాదాలు. మీరు చూపించే ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోను. ఈ సినిమా మనందరిదీ. దీని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’’ అని తేజ్ పోస్టు పెట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news