భాగమతి డైరక్టర్ తో మెగా మేనళ్లుడు..!

-

పిల్ల జమిందార్ సినిమాతో సక్సెస్ అందుకున్న డైరక్టర్ అశోక్ ఈ ఇయర్ భాగమతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. భాగమతి సక్సెస్ తర్వాత అశోక్ ఇంతవరకు ఏ సినిమా ఎనౌన్స్ చేయలేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం అశోక్ మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. ఈమధ్యనే స్టోరీ డిస్కషన్స్ జరిగాయట. ప్రస్తుతం సాయి ధరం తేజ్ కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి సినిమా చేస్తున్నాడు.

ఆ సినిమా పూర్తి కాగానే అశోక్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తారని తెలుస్తుంది. ఈమధ్య వరుస ఫ్లాపులు ఎదుర్కుంటున్న తేజూ కెరియర్ పై మెగా ఫ్యామిలీ ఫోకస్ పెట్టింది. అందుకే గీతా ఆర్ట్స్ లో తేజూ మూవీ చేస్తున్నారట. ఈ సినిమా కథ కూడా భాగమతి లానే థ్రిల్లర్ గా ఉంటుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news