మా ఫ్యామిలీ అంతా పవన్ వెంటే.. పాలిటిక్స్​పై సాయిధరమ్ తేజ్ కామెంట్స్

-

తమ కుటుంబమంతా జనసేన అధినేత పవన్ కల్యాణ్​తోనే ఉంటారని సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ స్పష్టం చేశారు. బ్రో సినిమాలో ఓ సీన్​ వివాదం అవ్వడం గురించి మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబుపై జోకులు వేసే ఉద్దేశంతో ఆ సీన్‌ తీయలేదని చెప్పారు. సినిమా, రాజకీయాలను వేర్వేరుగా చూడాలని అన్నారు. తనకు రాజకీయ అనుభవం లేదని.. కానీ పాలిటిక్స్​లో మాత్రం తమ ఫ్యామిలీ అంతా పవన్ వెంటే ఉంటుందని తెలిపారు.

‘బ్రో’ చిత్రంలో నా క్యారెక్టర్‌ చనిపోయినప్పుడు భ్రమతో మూడు గంటలు ఏడ్చా.. పవన్‌ మామయ్యకు దూరమై పోతున్నాననే బాధతో. కానీ మేమంతా పవన్‌ కల్యాణ్‌తోనే జీవితాంతం ఉంటాం.’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. బ్రో చిత్రం కథ వినగానే ఎప్పుడెప్పుడు చేస్తానోనని ఆత్రుతగా ఎదురు చూశానని, చిరంజీవి మామయ్యతో నటించేందుకు వేయికళ్లతో ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. మల్టీస్టార్‌ చిత్రాల్లో నటించడానికి తానెప్పుడూ సిద్ధమేనన్నారు. పవన్‌, సాయితేజ్‌ నటించిన ‘బ్రో’ చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్రబృందం మంగళవారం శ్రీనగర్‌ కాలనీలోని ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడింది.

Read more RELATED
Recommended to you

Latest news