విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్

-

విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు సాయి ధరమ్ తేజ్. బ్రో చిత్రం విజయోత్సవంలో భాగంగా అమ్మవారిని దర్శించుకుంది చిత్ర బృందం. హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు సముద్రఘని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందుకుంది బ్రో చిత్రం బృందం. అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డు ప్రసాదాన్ని కూడా బ్రో చిత్రం బృందానికి అందించారు ఆలయ అధికారులు.

ఇది ఇలా ఉండగా, “బ్రో” సినిమా పోస్టర్ ముందు బ్లేడుతో కోసుకున్నాడు పవన్ కళ్యాణ్ అభిమాని. మదనపల్లి లో బ్రో సినిమా ఆడుతున్న ఓ థియేటర్ ముందు అభిమాని బ్లేడుతో పలుమార్లు చేతిని కోసుకున్నాడు. పవన్ కళ్యాణ్ కోసం రక్తం, ప్రాణం ఇస్తానంటూ హల్ చల్ చేశాడు పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్ చాలా బాగా యాక్టింగ్ చేశారని చెబుతూ.. హల్చల్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news