అక్కినేని కోడ‌లికి 3 కోట్లు ఇవ్వాల్సిందే

-

అక్కినేని ఇంట కోడ‌లిగా అడుగుపెట్టిన త‌ర్వాత స‌మంత రేంజ్ మారిపోయింది. హీరోయిన్ గా క్రేజ్ ప్ల‌స్ అక్కినేని బ్రాండ్ తో మార్కెట్ లో కొన‌సాగుతోంది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో యూ ట‌ర్న్ తో లేడీ ఓరియేంటెడ్ సినిమాల్లోకి అడుగు పెట్టిది. ఆ సినిమా అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయినా న‌టిగా పాస్ అయింది. ఆ వెంట‌నే భ‌ర్త నాగ‌చైత‌న్య తో క‌లిసి మ‌జిలీ తో క్లాసిక్ హిట్ ను అందుకుంది. ఇక తాజాగా ఇటీవ‌లే విడుద‌లైన `ఓ బేబి`తో భారీ బ్లాక్ బాస్ట‌రే ఖాతాలో వేసుకుంది. ఈ హిట్ తో లేడీ ఓ రియేంటెడ్ సినిమాల‌కు ఏ మాత్రం తీసిపోన‌ని చాటి చెప్పింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది.

Samantha Akkineni hikes remuneration
Samantha Akkineni hikes remuneration

40 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. స‌మంత న‌ట‌న‌, ఆహార్యం అన్నీ క‌లిసొచ్చాయి. ఈ నేప‌థ్యంలో స‌మంత పారితోషికం పెంచింద‌ని ఆమె మేనేజ‌ర్ నుంచి ఓ లీక్ అందింది. ఇప్ప‌టివ‌కూ కోటిన్న‌ర తీసుకున్న భామ అమాంతం డ‌బుల్ ఛార్జ్ చేస్తోందిట‌. అంటే ఇక‌పై ఏ సినిమాకైనా 3 కోట్లు చెల్లించాల్సిందేన‌ని కొత్త ప్ర‌తిపాద‌న తీసుకొచ్చిందన్న మాట‌. అడ్వాన్స్ గానే కోటి రూప‌యాలు చెల్లించాలంటోందిట‌. `ఓ బేబి` స‌క్సెస్ తోనే ఇంత హైక్ కి చేరుకుంద‌ని తెలుస్తోంది. దీంతో స‌మంత పారితోషికం అందుకోవ‌డంలో టాప్ -2కి చేరుకుంది.

ఐదు కోట్ల పారితోషికంతో న‌య‌న‌తార మొద‌టి స్థానంలో ఉంది. ఆ త‌ర్వాతి స్థానం 3 కోట్ల‌తో అక్కినేని కోడ‌లిదేన‌ని నిపుణులు అంటున్నారు. స్వీటీ అనుష్క మొన్న‌టి వ‌ర‌కూ 2 కోట్ల పారితోషికంతో రెండ‌వ స్థానంలో ఉండేది. `బాహుబ‌లి`, `భాగ‌మ‌తి` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు ఉన్నా త‌ర్వాతి సినిమాల విష‌యంలో అమ్మ‌డు రూపాయి కూడా అద‌నంగా పెంచ‌లేదు. కానీ సామ్ ఒక్క స‌క్సెస్ తోనే పారితోషికం రెట్టింపు చేసేసింది. ఈ విష‌యం తెలిసిన స్వీటీ కూడా షాకైందిట‌.

Read more RELATED
Recommended to you

Latest news