చైతూ పై వస్తున్న రూమర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సమంత.. వారికేనా!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో సమంత , నాగచైతన్య ఒక క్యూట్ జోడి గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే వీరిద్దరూ కూడా ఏం మాయ చేసావే అనే సినిమా ద్వారా పరిచయమయ్యి ఒకరికొకరు ఇష్టపడ్డారు . అలా పది సంవత్సరాలపాటు ప్రేమించుకుని ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఇక నాలుగు సంవత్సరాల పాటు సంతోషంగా వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్న ఈ జంట ఉన్నట్టుండి 2021 అక్టోబర్ 2వ తేదీన విడిపోతున్నాం అని ప్రకటించి అందరికీ ఆశ్చర్యాన్ని కలుగ జేసారు. ఇక ఆరోజు నుంచి అటు సమంతపై చైతన్య అభిమానులు, ఇటు చైతన్య పై సమంత అభిమానులు రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ క్రమంలోనే తాజాగా నాగచైతన్య మేజర్ సినిమా హీరోయిన్ శోభితా ధూళిపాళ తో డేటింగ్ చేస్తున్నాడు అని వార్తలు త్వరగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక మరొకవైపు మేజర్ సినిమా షూటింగ్ కోసం శోభిత హైదరాబాద్ కి వచ్చినప్పుడు చైతన్య కోసం జూబ్లీహిల్స్ లో ఉన్న నాగ చైతన్య కొత్త ఇంటికి పలుసార్లు వెళ్ళింది అని, చైతన్య కూడా శోభితా తో పలు సార్లు హోటల్ కి వెళ్లి అక్కడే సమయాన్ని గడిపారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉండడం గమనార్హం. ఇక ఇలా రోజురోజుకు వార్తలు బాగా ప్రచురితం అవుతూ ఉండడంతో ఈ వార్తలను సమంతనే కావాలని తన అభిమానులతో రూమర్స్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేయిస్తోందని నాగచైతన్య అభిమానులు సమంతా పై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఎట్టకేలకు సమంత కూడా స్పందించడం జరిగింది.

సమంత తన ట్విట్టర్ ద్వారా అమ్మాయిల పై రూమర్ వస్తే అమ్మాయిదే తప్పు అంటారు.. ఒకవేళ అబ్బాయి పై రూమర్ వస్తే అమ్మాయి చేయించింది అంటారు.. మీరు మారరా.. ఇకనైనా ఉన్నతంగా ఆలోచించి మీ గురించి మీ కుటుంబం గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ముఖ్యంగా మీరు మీ పని పైన కాన్సన్ట్రేట్ చేయండి.. మేము ఎప్పుడో విడిపోయాము.. ఇలాంటి రూమర్స్ ఎందుకు పనికి రావు అంటూ నెటిజన్లకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది సమంత.

Read more RELATED
Recommended to you

Exit mobile version