‘సర్కార్ వారి పాట’కు సర్కార్ గుడ్ న్యూస్…. టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వ అనుమతి

-

మోస్ట్ అవెయిట్ మూవీ ‘ సర్కార్ వారి పాట’. సరిలేరు నీకెవ్వరు సినిమా తరవాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన కళావతి సాంగ్ సూపర్ హిట్ అయింది. యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన ట్రైలర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మహేష్ జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. 

తాజాగా సర్కార్ వారి పాటకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.ఈనెల 12న విడుదల కానుంది. దీంతో ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 10 రోజుల పాటు ప్రతీ టికెట్ పైమ రూ. 45 అదనంగా పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీలో సర్కార్ వారి పాట ఓపెనింగ్స్ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version