‘చీకోటి’ కేసులో సంచలనాలు.. హీరోయిన్లకు కళ్లు చెదిరే పారితోషికాలు

-

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో క్యాసినో వ్యవహారం మరోసారి సంచలనమైంది. గత జనవరి సంక్రాంతి సమయంలో గుడివాడలో జరిగిన క్యాసినో వ్యవహారంపై పెద్ద దుమారమే చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా క్యాసినో ఏజెంట్లు అయిన చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది…తాజాగా ప్రవీణ్ మీడియా ముందుకొచ్చి…ఈడీ కొన్ని ప్రశ్నలు వేసిందని వాటికి సమాధానం చెప్పానని ప్రవీణ్ చెప్పుకొచ్చారు.

అయితే ఈ క్యాసినో వ్యవహారంలో పెద్ద తలకాయలు చాలామంది ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, అలాగే పలువురు ఎమ్మెల్యేలు…ప్రవీణ్ కస్టమర్ల లిస్ట్ లో ఉన్నారని కథనాలు వస్తున్నాయి. అలాగే సినీ నటులు, అధికారులు సైతం ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే.. టాలీవుడ్‌, బాలీవుడ్‌ హీరోయిన్లకు భారీగా పారితోషికాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

నేపాల్‌ లో నిర్వహించిన క్యాసినోకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన మల్లికా షెరావత్‌ కు కోటీ, అమిషా పటేల్‌కు రూ.80 లక్షలు, గోవిందకు రూ.50 లక్షలు, ఈషా రెబ్బాకు రూ.40 లక్షలు, డింపుల్‌ హయతీకి రూ.40 లక్షలు, ముమైత్‌ ఖాన్‌ కు రూ.15 లక్షలు, గణేష్‌ ఆచార్యకు రూ.20 లక్షలు చీకోటి ప్రవీణ్‌ ఇచ్చినట్లు ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news