BREAKING : పాలమూరు లిఫ్ట్‌ పనుల్లో అపశృతి..క్రేన్‌ తెగిపడి 5 గురు కూలీలు మృతి

-

BREAKING :నాగర్ కర్నూల్ జిల్లా పాలమూరు లిఫ్ట్‌ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. క్రేన్‌ వైర్‌ తెగిపడి ఏకంగా 5 గురు కూలీలు మృతి చెందారు. కొల్లాపూర్ మండలం ఏల్లూరు శివారులోని రేగమనగడ్డ వద్ద పాలమూరు – రంగారెడ్డి ప్యాకేజీ వన్ లో నిర్మాణం జరుగుతున్నాయి.

అయితే.. ఈ పనులను క్రేన్ సాయంతో పంపు హౌస్ లోకి దిగుతుండగా క్రేన్ వైరు తెగి ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది.

ఇక ఈ సంఘటనలో మృతి చెందిన వారి పార్ధివ దేహాలను రాత్రే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారని సమాచారం. మృతి చెందిన వారు బీహార్ కు చెందిన కూలీలుగా గుర్తించారు పోలీసులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news