నూతన దంపతులను ఆశీర్వదించిన షారుఖ్, రజినీకాంత్.. ఫొటోస్ వైరల్..!

-

గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న లేడీ సూపర్ స్టార్ నయనతార.. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈరోజు ఉదయం 8:10 గంటలకు అంగరంగ వైభవంగా అతిధుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. చెన్నైలోని మహాబలిపురంలో ఉన్న షెరటాన్ లగ్జరీ హోటల్లో వీరి వివాహం జరిగింది. ఇకపోతే వీరి వివాహ వేడుకకు ఎంతోమంది సినీ సెలబ్రిటీలతో పాటు సన్నిహితులు బంధువులు కూడా హాజరయ్యారు. పోతే తాజాగా ఈ వివాహ వేడుకకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో పాటు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ట్లు సమాచారం.Nayanthara Vignesh Shivan Marriage Live News: Nayanthara, Vignesh Shivan tie the knot on June 9 in Mahabalipuramపెళ్లి కూతురు చాలా చక్కటి వస్త్రాలంకరణ లో ముస్తాబయ్యి చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది నయనతార.. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కి అలాగే రజనీకాంత్ కి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా షారుక్ ఖాన్ ప్రస్తుతం జవాన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు కానీ తన తోటి నటీమణి వివాహ వేడుకకు షూటింగ్ నుంచి నేరుగా వివాహ వేడుకకు హాజరైనట్టు తెలుస్తోంది.

ఇక ఈ హోటల్ ముందు ఒక ఫ్లెక్సీ బోర్డు ని కూడా ఏర్పాటు చేశారు అందులో వెడ్డింగ్ కి ఆహ్వానం పలుకుతున్నట్లుగా నయన్ వెడ్స్ విక్కీ అని బోర్డులు రాయడం కూడా జరిగింది. ఇక అంతే కాదు ఈ వివాహ వేడుకకు అజిత్ కూడా హాజరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ఎది ఏమైనా లాంగ్ జర్నీ ని మొదలు పెట్టబోతున్న ఈ నూతన దంపతులు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.

 

Read more RELATED
Recommended to you

Latest news