రూటు మార్చిన కొరటాల శివ.. సక్సెస్ అవుతాడా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో ఓటమెరుగని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ.. ఇటీవల రామ్ చరణ్, చిరంజీవితో కలిసి తెరకెక్కించిన ఆచార్య సినిమాతో మొదటి సారి డిజాస్టర్ ను చవిచూడాల్సి వచ్చింది. ఇక ఈయన రచయిత గా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టి మిర్చీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో డైరెక్టర్గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇక ఆ తర్వాత శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న కొరటాల శివ ఆచార్య సినిమాతో మాత్రం డిజాస్టర్ కావడం ప్రస్తుతం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కొరటాల శివ డైరెక్టర్ గా ఎన్టీఆర్ తో తన కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. యువ సుధా ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.I may have to retire after five years: Koratala Siva | Telugu Movie News - Times of India

ఇకపోతే ఇప్పటి వరకు ఇండియన్ సినీ స్క్రీన్ పై చూడని డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు అని కొరటాల ఇదివరకే స్పష్టంచేశారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం ఏమిటంటే.. కొరటాల శివ ఇప్పటివరకు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలనే తెరకెక్కించడం జరిగింది. ఇక ఈయన సినిమా వస్తోందంటే చాలు సమాజానికి ఉపయోగపడే ఒక మంచి మెసేజ్ వస్తుందని అందరూ భావిస్తారు. అయితే ఈ సారి మాత్రం ఎలాంటి మెసేజ్ లేకుండా కేవలం మాస్ ఎంటర్టైనర్గా రూపొందించాలి అని కొరటాల శివ భావిస్తున్నారట. ఇక ఈ క్రమంలోనే భారీ మాస్ ఎలిమెంట్స్ , ఎలివేషన్స్, అద్భుతమైన డైలాగులతో స్క్రిప్ట్ సిద్ధం చేశారు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..NTR 30' will have an emotional storyline with universal appeal: Koratala Siva | Deccan Herald

ఇక ఇన్నిరోజులు మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో కొరటాల శివ దూసుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయన తన రూటు మార్చుకోవడం తో నిజంగానే సక్సెస్ అవుతాడా లేదా అనేది ప్రతి ఒక్కరి లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సందేహం తీరాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news