జైలర్ మూవీ కోసం నటీనటుల రెమ్యునరేషన్ తెలిస్తే షాక్..!

-

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటించిన చిత్రం జైలర్ ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా, మోహన్ లాల్ కీలకపాత్ర పోషించారు. ఆగస్టు 10వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పాలి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరొకవైపు సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయని చెప్పాలి. వీటన్నింటిని బట్టి చూస్తే ఈసారి రజినీకాంత్ ఖాతాలో సాలిడ్ హిట్ పక్కా అన్నట్టుగా అనిపిస్తుంది.

ఇక ఇందులో శివరాజ్ కుమార్, సునీల్, జాకీష్రాఫ్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో నటించిన రజినీకాంత్ , తమన్నా, మోహన్ లాల్ పారితోషకాలు లీక్ అవ్వడమే కాదు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇకపోతే సినిమా బడ్జెట్ కి కాస్టింగ్ రెమినరేషన్స్ 60% ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా ₹110 కోట్ల రూపాయలు పారితోషకం తీసుకుంటున్నారట మరొకవైపు మోహన్ లాల్ ₹8 కోట్లు తీసుకుంటుండగా శివరాజ్ కుమార్ , జాకీ ష్రాఫ్ లకు ₹4కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇక ఇందులో హీరోయిన్ గా తమన్నాకు ₹3 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక యోగి బాబుకి కోటి రూపాయలు, రమ్యకృష్ణ కి ₹8లక్షలు, సునీల్ కి ₹70 లక్షల వరకు పారితోషకం అందించారట. ఇతర నటీనటులకు మరో ₹2 కోట్ల వరకు ఖర్చు అయ్యి ఉంటుందని, టెక్నీషియన్లకు ఇంకో ₹5 కోట్ల వరకు ఖర్చయింటుందని సమాచారం. మొత్తంగా ఈ సినిమాకు ₹150 కోట్ల వరకు పారితోషకం రూపంలోనే నిర్మాతలు అందించగా.. మొత్తం బడ్జెట్ ₹225 కోట్లు అయినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news