ఏయిర్ పోర్ట్‌లో సోనూ కోసం గ‌లాటా!

-

సొను సూద్.. ఈ పేరు వింటే గుర్తొచ్చేది టాలీవుడ్ తెర‌పై క‌నిపించే విల‌న్. కానీ లాక్‌డౌన్ త‌రువాత వెండితెర విల‌న్ కాస్తా నిజ‌జీవితంలో హీరో అయిపోయాడు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించ‌డంతో వ‌ల‌స కూలీలు దుర్భన ప‌రిస్థితుల్ని ఎదుర్కొన్నారు. అలాంటి వారికి ప్ర‌త్య‌క్ష్య దైవంగా నిలిచాడు సోనుసూద్‌. కేంద్ర ప్ర‌భుత్వం కూడా అత‌ను చేసినంత‌గా చేయ‌లేక‌పోయింది.

ఎక్క‌డ క‌ష్టం వుందో అక్క‌డ తానున్నాన‌ని భ‌రోసా నివ్వ‌డ‌మే కాకుండా త‌న గ‌మ్యం చేరుకోవ‌డానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వ‌ల‌స కూలీకు అండ‌గా నిలిచారు సోనుసూద్ దీంతో అత‌ను జాతీయ స్థాయిలో హీరో అయిపోయాడు. ఇప్పుడ‌ స్టార్ హీరోకు కూడా లేని ఫాలోయింగ్ అత‌ని సొంతం. ఎక్క‌డికి వెళ్లినా అయ‌న‌ని అభిమానులు చుట్టుముడుతున్నారు. తాజాగా షంషాబాద్ ఏయిర్ పోర్ట్‌లో ఆయ‌న కోసం అభిమానులు చిన్న గలాటానే చేయాల్సి వ‌చ్చింది. మాస్క్‌లో వున్నా కూడా సోనూని గుర్తించిన అభిమానులు అత‌నితో ఫొటోలు దిగ‌డానికి ఎగ‌బ‌డ్డారు. అభిమానుల ఉత్సాహాన్ని కాద‌న‌లేని సోను అభిమానుల సెల్ఫీల‌కు పోజులిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news