త్వరలో ఇండస్ట్రీకి మరో వారసుడు.. తల్లిలాగే సక్సెస్ అవుతాడా..?

-

ఇప్పటికే చాలామంది హీరోలు తమ వారసులను ఇండస్ట్రీకి తీసుకొచ్చి సక్సెస్ సాధిస్తున్న విషయం తెలిసిందే. అలాగే హీరోయిన్లు కూడా తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు మరో వారసుడు కూడా ఇండస్ట్రీకి రావడానికి సిద్ధమవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ వారసుడు ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటీమణి సిమ్రాన్ కొడుకు. తెలుగు , తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి క్రేజ్ దక్కించుకున్న సిమ్రాన్ టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, హరికృష్ణ ఇలా ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించి మెప్పించారు.

వెండితెరపై తన అందం, అభినయంతో కుర్ర కారుమతి పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోలకు పోటీని ఇచ్చారని చెప్పవచ్చు. ముఖ్యంగా తన గ్లామర్ విషయంలో కుర్రకారును ఆకట్టుకున్న ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. 2003లో తన చిరకాల స్నేహితుడు దీపక్ భగ్గా ను వివాహం చేసుకొని అమెరికాలో సెటిల్ అయినా ఈ జంటకు ఇద్దరు కుమారులు కాగా అందులో పెద్ద కొడుకు అదిప్ ఓదో.. చిన్న కొడుకు అజిత్ వీర్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో చేస్తున్న సిమ్రాన్ చివరిగా రాకెట్రీ లో కనిపించిన విషయం తెలిసిందే. ఇక అటు సినిమా కెరియర్ ను ఇటు ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తూ బిజీగా ఉన్న ఈమె అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలను కూడా నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే తన కొడుకుల ఫోటోలను కూడా షేర్ చేసిన సిమ్రాన్ త్వరలోనే తన కొడుకును కనీసం చైల్డ్ ఆర్టిస్ట్ గా అయిన ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీకి తీసుకురావాలని కోరుతున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి ఇప్పుడు అదీప్ పైనే పడిందని చెప్పాలి. చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్న ఈ కుర్రాడు ఇండస్ట్రీలోకి వస్తే తప్పకుండా తల్లిలాగే సక్సెస్ అవుతాడనే కామెంట్లు కూడా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news