స్టేజిమీద‌నే ముద్దులు పెట్టేసిన శ్రీముఖి.. ఎవ‌రికో తెలుసా!

-

ఈ మ‌ధ్య బుల్లితెర‌పై కూడా ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు న‌టీన‌టులు. ముఖ్యంగా యాంక‌ర్లు, వారి కో స్టార్లు ఈ విష‌యంలో అంద‌రికంటే ముందున్నారు. ఇప్ప‌టికే షోల‌ల్లో హ‌ద్దులు మీరుతున్నారంటూ అనేవ విమ‌ర్శ‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ వీరు మాత్రం ఎంత‌కూ త‌గ్గ‌ట్లేదు. ఇప్పుడు కూడా ఇదే స్థాయిలో రెచ్చిపోయింది ప్ర‌ముఖ యాంక‌ర్ శ్రీముఖి. ఏకంగా అంద‌రి ముందే స్టేజిపైనే ముద్దుపెట్టేసింది.

శ్రీముఖి అంటే అంద‌రికీ ప‌రిచ‌యం ఉన్న పేరే. పలు షోలల్లో ఆమె యాంకరింగ్ చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. వెండితెరపై కూడా స‌త్తా చాటుతూ తన పాత్రలతో బాగానే ఆక‌ట్టుకుంటోంది. అయితే ఇప్పుడు ఆమె చేసిన ప‌ని అంద‌రికీ షాకింగ్ గా ఉంద‌నే చెప్పాలి.

ఓంకార్ హోస్టింగ్ గా చేస్తున్న సిక్త్స్‌ సెన్స్ అనే ప్రోగ్రామ్‌కు ఎపిసోడ్ ప్రోమోను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. అయితే ఇందులో అంద‌రూ చూస్తుండ‌గానే శ్రీముఖి డ్యాన్స్ మాస్ట‌ర్ శేఖర్ కు తెగ ముద్దులు పెట్టి షాక్ చేసింది. వెంట‌నే శేఖర్ మాస్టర్ స‌తీమ‌ణి ఏమనుకుంటుందో అని డైలాగ్ చెప్తూ మీ భార్య పేరు ఏంటండి అని మాస్ట‌ర్‌ను క్వ‌శ్చ‌న్ వేస్తుంది. ఇది జ‌స్ట్ షో కి సంబంధించించిన మ్యాట‌ర్ అని చెప్పింది. ప్ర‌స్తుతం ఈ ప్రోమో తెగ వైర‌ల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news