తెలంగాణలో ఈ నెల 25 నుంచి బోనాల పండగ

-

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి బోనాల పండుగ జరగనుంది. ఈ నెల 25న ఉజ్జయిని మహంకాళి అమ్మ వారికి అధికారికంగా బోనాలు సమర్పించనుంది తెలంగాణ సర్కార్. అలాగే ఈ నెల 26 న ఉజ్జయిని అమ్మవారి రంగం మరియు ఊరేగింపు ఉండనుంది. తెలంగాణ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మరియు లాక్డౌన్ ఎత్తివేత నేపథ్యంలో బోనాల పండుగ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బోనాల పండుగ లో పాల్గొనే ప్రతి ఒక్కరు మాస్కులు, భౌతిక దూరం పాటించాలని సూచనలు చేసింది.

కాగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు తెలంగాణ లోని చాలా జిల్లాల్లో ఈ బోనాల పండుగ నిర్వహిస్తారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అతి గొప్పగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను “ఆషాఢ జాతర” అని కూడా అంటారు. వర్షాలు మొదలయ్యే సమయంలో జంట నగరాలలో మాత్రమే కాకుండా.. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రతి ఆదివారం ఒక్కొక్క ప్రదేశంలో బోనాల జాతర జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news