అమితాబచ్చన్‌ పాత్రలో రీ ఎంట్రీ ఇవ్వనున్న పవన్‌

-

గ‌త కొద్దిరోజులుగా ప‌వ‌ర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ మరలా సినిమా చేయనున్నారని అటు సినీవర్గాలలో ఇటు రాజకీయ వర్గాలలో జోరుగా ప్ర‌చారం న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేక‌పోవ‌డంతో అంద‌రూ డౌట్‌లో ఉండ‌గా… దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన పింక్ చిత్ర తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్లు తెలుస్తుంది.

ఆయ‌న రీ ఎంట్రీ సినిమా లాంచ్‌కు డేట్ కూడా ఫిక్స‌యిన‌ట్టు స‌మాచారం. నానితో ఎంసీఏ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకోగా, బోనికపూర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం. బాలీవుడ్ లో పింక్ టైటిల్‌తో సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన బోనీ కపూర్ ఆ తర్వాత అదే సినిమాను కోలీవుడ్‌లో రీమేక్ చేసి హిట్ కొట్టగా… అదే ఇక్క‌డ తెలుగులో కూడా రీమేక్ చేయ‌నున్నారు.

అయితే దిల్ రాజు – బోనీక‌పూర్ క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తారు. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసే వేణుశ్రీరామ్ గ‌తంలో ఇదే దిల్ రాజు బ్యాన‌ర్‌లో ఓ మై ఫ్రెండ్ సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ – శృతిహాసన్ హీరోయిన్లుగా న‌టించారు. ఇక ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకుని ఏకంగా ప‌వ‌న్ రీ ఎంట్రీ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ద‌క్కించుకున్నాడు. ఇక ఈ సినిమాపై నేడో రేపో అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news