బన్నీ విలన్ గా బాబీ, ఖరారు చేసిన సుకుమార్…!

-

అలా వైకుంఠపురములో సినిమా మంచి విజయం సాధించిన తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఇటీవల విడుదల చేసాడు. ఎర్రగంధపు చెక్క స్మగ్లర్ల జీవితాలను ఆధారంగా చేసుకుని రానుంది ఈ సినిమా. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ ని చూసిన అభిమానులు షాక్ అయ్యారు. ఇక ఈ సినిమాలో విలన్ గా ఎవరు అన్తిస్తారు అనేది స్పష్టత లేదు.

ముందు విజయ్ సేతుపతి అని అన్నారు. కాని ఆయన వరుస సినిమాలతో అతను బిజీ గా ఉండటంతో విజయ్ ని కాదని బాబీ సింహా అనే నటుడ్ని ఈ సినిమా కోసం తీసుకున్నారట. అతనితో ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయి అని సమాచారం. ఈ చిత్రంలో కొన్ని వివాదాలు ఉన్నాయని అందుకే విజయ్ సేతుపతి వెనక్కు తగ్గాడని టాలీవుడ్ జనం అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అటవీ అధికారులు చాలా మంది తమిళులను స్మగ్లర్లు అని భావించి కాల్చి చంపిన నిజ జీవిత సంఘటనలు కొన్ని ఉన్నాయి. అందుకే ఆ పాత్ర చేయడానికి అతను ముందుకు రాలేదని సమాచారం. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడానికి మేకర్స్ కూడా నివేదా థామస్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news