నిర్మాత సురేష్ బాబు కారు బీభత్సం.. ముగ్గురికి గాయాలు

-

సిని నిర్మాత సురేష్ బాబుకి సంబందించిన ఓ కారు కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో రాంగ్ రూట్ లో వచ్చి టూ వీలర్ మీద వెళ్తున్న వారిని ఢీ కొట్టడం జరిగింది. కారు బలంగా ఢీ కొట్టడం వల్ల టూ వీలర్ మీద ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయట. సతీష్ చంద్ర, దుర్గా దేవిలతో పాటుగా వారి మూడేళ్ల బాబు సిద్ధేశ్ చంద్ర కూడా గాయాలయ్యాయట.

స్థానికులు వెంటనే యశోద హాస్పిటల్ కు తీసుకెళ్లారని తెలుస్తుంది. కెపిహెచ్బి నుండి తాడ్ బండ్ మీదుగా లాలాగూడ వెళ్తున్న ఈ కారు రాంగ్ రూట్ లో రావడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది. కార్ఖానా పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఓనర్ అయిన సురేష్ బాబుకి 41ఏ నోటీసులు పంపించారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version