ఏపీలో ఫ్యాన్స్ మృతి.. కుటుంబాలకు అండగా ఉంటానన్న సూర్య

-

తమిళ సూపర్ స్టార్ సూర్య శివకుమార్ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా వేడుకలు జరిపారు. అయితే ఏపీలోనూ ఆయన ఫ్యాన్స్ బర్త్ డే ను నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ఇద్దరు అభిమానులు మృతి చెందారు. సూర్య పుటిన రోజు సందర్భంగా ఏపీలో ఆయన అభిమానులు ఇద్దరు ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్​తో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య.. మృతుల కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలానికి చెందిన ఇద్దరు డిగ్రీ విద్యార్థులు హీరో సూర్య ఫ్లెక్సీలు కడుతూ మృతి చెందారు. దీంతో వారి కుటుంబాలను సూర్య వీడియో కాల్‌లో పరామర్శించారు. వాళ్లకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు. మృతుడి సోదరి తాను డిగ్రీ చదివానని ఉద్యోగం ఇప్పించలాని కోరగా.. తప్పకుండా ఆమె బాధ్యత తీసుకుంటానని సూర్య తెలిపారు. ఉద్యోగంతో పాటు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పి.. వారిలో ధైర్యాన్ని నింపారు.

Read more RELATED
Recommended to you

Latest news