అమరావతి ఇకపై మనందరి అమరావతి – సీఎం జగన్

-

అమరావతి ఇకపై సామాజిక అమరావతి అన్నారు సీఎం జగన్. సామాజిక అమరావతికి శ్రీకారం చుట్టామని… ఇకపై మనందరి అమరావతి అని సీఎం జగన్ ప్రకటించారు. పేదలకు అండగా మార్పు మొదలైందని, అక్క చెల్లెమ్మల పేరిట పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు.

CRDA పరిధిలో 793 ఇళ్ల నిర్మాణాలకు రూ. 1370 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. నీళ్లు, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. అక్కాచెల్లెమ్మలకు ఇస్తున్న ఒక్కో ఇంటి విలువ సుమారు రూ. 12లక్షలకు పైగా ఉంటుందని అన్నారు.

రాజధాని అని చెప్పుకుంటున్న అమరావతిలో పేదలకు ఇల్లు ఇస్తుంటే చూసి తట్టుకోలేని చంద్రబాబు కేసులు పెట్టడానికి కోర్ట్ లకు వెళ్లిన పరిస్థితి మీరందరూ ఆలోచించాలి అన్నారు. ఇక్కడ మీకు ఇల్లు ఇస్తే అమరావతిలో అభివృద్ధి ఆగిపోతుందని అర్ధం లేని ఆలోచనలతో మా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని వాస్తవాన్ని తెలియచేసే ప్రయత్నం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news