అందుకే శోభన్ బాబు అన్ని వేల కోట్లకు అధిపతి అయ్యారా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆంధ్ర సోగ్గాడిగా గుర్తింపు తెచ్చుకున్న శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పట్లో మహేష్ బాబుకు ఉన్నంత లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అప్పట్లో అంతకుమించి శోభన్ బాబు సొంతం.. సినిమా ఇండస్ట్రీలో ఎవర్గ్రీన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన తన సినిమాలతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. శోభన్ బాబు సినిమా విడుదలవుతోంది అంటే చాలు థియేటర్ల వద్ద ఆడవాళ్ళు ఎక్కువగా క్యూ కట్టే వారని సమాచారం.. ఇకపోతే అప్పట్లో శోభన్ బాబు చనిపోయినప్పుడు కూడా చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలు కూడా తమ ఇళ్లల్లో ఎంతమంది హీరోలు ఉన్నా సరే తమ ఇంటి ఆడవాళ్లకు శోభన్ బాబు సినిమాలంటేనే ఇష్టం అని చెప్పేవారట అంతలా పాపులారిటీ దక్కించుకున్నారు శోభన్ బాబు.

అలా సినిమాలలో సంపాదించిన డబ్బును ఎక్కువగా భూమికి ఖర్చు చేసేవారు. భూమికి డబ్బులు పెడితే అంతకు రెట్టింపు స్థాయిలో తిరిగి ఇస్తుందని నమ్మిన ఏకైన హీరో.. అలా ఒక రియల్ ఎస్టేట్లోనే కొన్ని వేల కోట్ల ఆస్తులను కూడా పెట్టారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఆయన స్నేహితుడు మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం జరిగింది. శోభన్ బాబు గురించి టాపిక్ వస్తే చాలు ఆయన ఆస్తులు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. మురళీమోహన్ తో పాటు చంద్రమోహన్ హీరోలుగా వున్నప్పుడే.. అక్కడ ఆయన స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే కొన్ని వేల ఎకరాలు కొన్నాడని అవన్నీ ఇప్పుడు లెక్కలేస్తే సుమారుగా రూ.80 వేల కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

ఇంత ఆస్తులు సంపాదించిన శోభన్ బాబు తన కొడుకుని మాత్రం ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. ఇక శోభన్ బాబు కొడుకు కూడా తమ ఆస్తులను పెంచుకుంటూ.. బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news