కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ కన్నుమూత!

-

కేరళలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాంది మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు మీడియాకు అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ… నిన్న రాత్రి మృతి చెందినట్లు తెలుస్తోంది.

1943 సంవత్సరంలో జన్మించిన ఉమెన్ చాందీ… 2004 నుంచి 2006 వరకు… తిరిగి 2011 నుంచి 2016 వరకు ముఖ్యమంత్రిగా పని చేశారు. 2018 సంవత్సరంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఎంపికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్న ఉమెన్ చాందీ… 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news