నాడు కెమెరామెన్.. నేడు ఇస్మార్ట్..!

-

సినిమా క్లైమాక్స్‌లో తెలంగాణ భ‌వ‌న్‌ని ముట్ట‌డించాల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇండైరెక్ట్‌గా ప్ర‌బోధించే స‌న్నివేశం తెలంగాణ ఉద్య‌మాన్ని మ‌రింత రెచ్చగొట్టి ర‌చ్చ చేసేలా చేసింది. ఈ చిత్రాన్ని నైజామ్‌, వైజాగ్‌ల‌లో పంపీణీ చేసిన దిల్ రాజు తెలంగాణ అంత‌ట సినిమాను నిలిపివేయ‌డంతో కొంత మేర న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది.

తెలంగాణ ఉద్య‌మం ఉధృతంగా వున్న స‌మ‌యంలో టాలీవుడ్ పై ఎటాక్స్ గురించి తెలుగు ప్ర‌జ‌లు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. తెలంగాణ స‌మాజాన్ని కించ‌ప‌రుస్తూ ఏ సినిమా వ‌చ్చినా.. ఏ నాయ‌కుడు కెలుకుతూ మాట్లాడినా తెలంగాణ వ్యాప్తంగా గొడ‌వ‌లైపోయేవి. జ‌నాల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉప్పెన‌లా దూసుకొచ్చేది. ఆ హీట్‌ను త‌న సినిమాకు పావుగా వాడుకోవాల‌ని తెరాస అధినాయ‌క‌త్వాన్ని వ్య‌గ్యంగా కించ‌ప‌రుస్తూ తెలంగాణ భ‌వ‌న్‌ను.. గులాబీ బాస్ కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ పూరి జ‌గ‌న్నాధ్- ప‌వ‌న్ క‌ల్యాణ్ ద్వ‌యం చేసిన చిత్రం `కెమెరామెన్ గంగ‌తో రాంబాబు`. ఈ సినిమా విడుద‌లైన రోజు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ శ్రేణులు చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. దీంతో నేరుగా పూరి ఆఫీస్ మీద‌నే దాడి చేసిన ఘ‌ట‌న‌ను మ‌ర‌వ‌లేం. ఆ సినిమా ప్ర‌ద‌ర్శిస్తున్న థియేట‌ర్ల‌ని దాదాపు మూసివేసే ప‌రిస్థితి ఎదురైంది.

సినిమా క్లైమాక్స్‌లో తెలంగాణ భ‌వ‌న్‌ని ముట్ట‌డించాల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇండైరెక్ట్‌గా ప్ర‌బోధించే స‌న్నివేశం తెలంగాణ ఉద్య‌మాన్ని మ‌రింత రెచ్చగొట్టి ర‌చ్చ చేసేలా చేసింది. ఈ చిత్రాన్ని నైజామ్‌, వైజాగ్‌ల‌లో పంపీణీ చేసిన దిల్ రాజు తెలంగాణ అంత‌ట సినిమాను నిలిపివేయ‌డంతో కొంత మేర న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది. ఈ సినిమా ఇచ్చిన షాక్ ని పూరి జ‌గ‌న్నాధ్ అప్పుడే మ‌ర్చిపోయిన‌ట్టున్నారు. ఇటీవ‌ల త‌న‌ని తెలంగాణ ప్ర‌భుత్వం డ్ర‌గ్స్ పేరుతో వేధించిన అంశాన్ని మ‌న‌సులో పెట్టుకున్నాడా? అంటూ తెరాస వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆ గాయం వ‌ల్ల‌నే మ‌రోసారి తెలంగాణ భాష‌, యాస‌పై ఇస్మార్ట్‌గా `ఇస్మార్ట్ శంక‌ర్` పేరుతో సెటైర్ వేయ‌బోతున్నాడా? అంటూ పంచ్ లు వేస్తున్నారు.

అక్ర‌మంగా డ్ర‌గ్స్ వివాదంలోకి త‌న‌ని లాగి త‌న‌ని హ‌ర్ట్ చేసినందుకు ఇస్మార్ట్‌తో బ‌దులు తీర్చుకోబోతున్న‌ట్లు ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్ చెబుతోంది. ఇస్మ‌ర్ట్ శంక‌ర్ ట్రైల‌ర్‌లో తెలంగాణ యాస‌ను, భాష‌ను మ‌రింత దిగ‌జారుస్తూ చూపించిన తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. రామ్ ఫ్యాన్స్ జేజేలు కొడుతున్నా చాలా మంది తెలంగాణ వారు మాత్రం ఈ సినిమా ఊర మాస్‌గా వుంద‌ని, తెలంగాణ యాస‌ను కించ‌ప‌రిచే విధంగా వుంద‌ని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అప్పుడు `కెమెరామెన్ గంగ‌తో రాంబాబు`తో కాంట్ర‌వ‌ర్సీని క్రియేట్ చేసిన పూరి అదే స్థాయిలో `ఇస్మార్ట్ శంక‌ర్‌తో మ‌ళ్లీ అదే ఫీట్‌ని రిపీట్ చేయ‌బోతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ నెల 18న‌ రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ సినిమా రిలీజ్ త‌రువాత ఎలాంటి హంగామా సృష్టిస్తుందో..ఏ స్థాయి కాంట్ర‌వ‌ర్సీల‌కు కేంద్ర బిందువుగా మారుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news