పాపం 30 ఇయర్స్ పృథ్వీ – ఈ విషయం తెలిసి ఎవరికైనా జాలేస్తుంది !

-

కమెడియన్ పృథ్వి అంటే అందరికీ తెలిసినదే. 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగుతో పాపులర్ అయిన పృద్వి రాజకీయాలలో మరియు సినిమారంగంలో కూడా రాణిస్తున్నారు. వైసీపీ పార్టీలో జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పాదయాత్ర చేస్తున్న టైంలో పార్టీకి అండగా ఉంటూ కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో కూడా పార్టీ తరఫున విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు 30 ఇయర్స్ కమెడియన్ పృథ్వి. తర్వాత వైసీపీ అధికారంలోకి రావటం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వం తరపున ఎస్వీబీసీ ఛానల్ కి చైర్మన్ పదవి లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి నీ కూర్చోపెట్టడం జరిగింది.

Image result for thirty years prudhvi

అయితే ఎస్ వి బి సి సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగి తో అసభ్యకరంగా మాట్లాడుతూ పృథ్వి మాట్లాడిన ఆడియో అప్పట్లో లీక్ అయింది. ఆ దెబ్బతో వైసిపి పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో వెంటనే ఆ పదవి నుండి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ని తప్పించడం జరిగింది. దీంతో రాజకీయంగాను మరియు ఇండస్ట్రీ పరంగాను పృద్వి పై అనేక విమర్శలు వచ్చాయి.

 

కాగా లీక్ అయిన ఆడియోలో వెనక నుండి నిన్ను వాటేసుకోవాలని అనిపించింది కానీ కెవ్వుమని కేక వేస్తావు అని భయమేసింది అంటూ మాట్లాడిన పృద్వి డైలాగ్ తో తెలుగు కామెడీ షో ‘జబర్దస్త్’ లో అదేవిధంగా ‘అదిరింది’ అనే మరో కామెడీ షో లో పృధ్విని టార్గెట్ చేస్తూ స్కిట్ చేస్తున్నారు. ఈ స్కిట్ కు సంబంధించి వెనక నుండి వాటేసుకున్నాడు ఏమో పని లైన్ పై కామెడీ షో లు చేయడంతో పృద్వి పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటో అంటూ తెగ మదనపడుతున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. 

Read more RELATED
Recommended to you

Latest news