ఒకే ఫ్రేమ్‌లో మూడు ఇండస్ట్రీల స్టార్‌ హీరోలు .. ఫొటో వైరల్‌

-

ఇద్దరు హీరోలు ఒక చోట కనిపిస్తేనే అభిమానులు పండుగ చేసుకుంటారు. అలాంటిది మూడు ఇండస్ట్రీలకు చెందిన నటులు.. అది కూడా స్టార్ హీరోలు.. ఇంకా వారి సతీమణులతో కలిసి ఒకేచోట కనిపిస్తే.. దసరా, దీపావళి పండుగలన్నీ ఒకేసారి చేసుకున్నంటు ఉండదు. అలాంటి అరుదైన ఘట్టం అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహ వేడుకలో చోటుచేసుకుంది.

టాలీవుడ్‌, కోలీవుడ్‌, మలయాళీ సినిమా ఇండస్ట్రీకి చెంందిన స్టార్‌ హీరోలు ఒకే చోట కలిసి.. కుటుంబసమేతంగా ఫొటోలకు పోజులిచ్చారు. అనంత్‌ పెళ్లి వేడుకల్లో భాగంగా దిగిన ఓ ఆసక్తికర ఫొటోను తాజాగా నటి నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ నెట్టింట షేర్‌ చేశారు. ‘‘మంచి మనసు ఉన్న వ్యక్తులతో అందమైన క్షణాలు’’ అని ఆయన క్యాప్షన్‌ యాడ్ చేశారు. ఈ ఫొటోలో విఘ్నేశ్‌ శివన్‌ – నయనతార, మహేశ్‌బాబు – నమ్రత, సూర్య- జ్యోతిక, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ – సుప్రియ దంపతులతోపాటు జెనీలియా, అఖిల్‌, సితారలను చూడొచ్చు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news