‘మహర్షి’లో రైతుగా నటించిన గురుస్వామి కన్నుమూత

-

‘మహర్షి’ చిత్రంలో రైతుగా నటించిన గురుస్వామి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’లో రైతు పాత్రలో నటించి.. రైతుకు మట్టికి ఉన్న బంధాన్ని ఎంతో హృద్యంగా చెప్పారు. ఈ సన్నివేశంలో గురుస్వామి నటన భావోద్వేగంగా సాగుతుంది.

గురుస్వామి కర్నూలు జిల్లా  వెల్దుర్తిలో పుట్టారు. విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేశారు. చదువు పూర్తయిన తర్వాత కొన్ని రోజులు కేంద్రప్రభుత్వ ఉద్యోగం చేశారు. అయితే, ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో ఒకవైపు ఉద్యోగం చేస్తూనే నటనవైపు వచ్చారు. విజేత ఆర్ట్స్‌ సంస్థను స్థాపించి కొన్ని నాటకాలు వేశారు.

2019లో వచ్చిన ‘మహర్షి’లో తెలుగు ప్రజలు గుర్తిండిపోయే పాత్రలో నటించారు. గురుస్వామి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news