హీరోయిన్లకు జీరో సైజ్ నచ్చడం లేదా…?

-

సినిమాల్లో హీరోయిన్ గా నటించాల౦టే ఎన్నో లక్షణాలు ఉండాలి. ఎప్పుడూ కూడా అభిమానులకు అందంగా కనపడుతూ ఉండాలి… వాళ్ళను వినోధపరిస్తేనే మార్కెట్ ఉంటుంది. లేకపోతే ఆ హీరోయిన్ కెరీర్ బస్టాండ్ ఏ అవుతుంది. సినిమాల్లో రాణించాలి అంటే ఫిట్నెస్, అందం, అభిమానం, సొగసు ఇలా ఎన్నో లక్షణాలు ఉండాలి. ఇవి లేకపోతే మాత్రం దర్శకనిర్మాతలు వారివైపు చూసే అవకాశం కూడా ఉండదు. ఇక హీరోయిన్ల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతున్న నేపధ్యంలో పోటీని తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది.

ఇందుకోసం ఒక్క సినిమా అవకాశం వచ్చినా చాలు నిరూపించుకోవడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు వారి గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. హీరోయిన్లు గతంలో మాదిరి జీరో సైజ్ కి ఇష్టపడటం లేదని అంటున్నారు సిని ప్రియులు. దానికి కారణం అభిమానుల తీరే అంటున్నారు. ఇప్పుడు అభిమానులు బొద్దుగా ఉండే హీరోయిన్ల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని వారికి ఫాలోయింగ్ కూడా అదే స్థాయిలో ఉంటుందని అంటున్నారు. నిత్యా మీనన్ కి చేసే సినిమాలు తక్కువే అయినా… ఫాలోయింగ్ మాత్రం ఎక్కువే ఉంటుంది.

దీనికి కారణం ఆమె బొద్దుగా ఉండటమే. ఇక కీర్తి సురేష్, సాయి పల్లవి అయితే నడుం మీద పెద్దగా ఫోకస్ చేయకుండా స్వతహాగా ఉంటున్నారు. అనుష్క, కాజల్, తమన్నా లాంటి సీనియర్ హీరోయిన్లు కూడా పెద్దగా జీరో సైజ్ మీద దృష్టి పెట్టడం కంటే కాస్త ఒళ్ళు ఉంటేనే బాగుంటుంది అనే భావనలో ఉన్నారట. పూజ హెగ్డే కాస్త సన్నబడినా, ఇప్పుడు బరువు పెరిగి బొద్దుగా కనపడటానికి ఇష్టపడుతుందని అంటున్నారు. అలాగే ఇస్మార్ట్ శంకర్ లో నటించిన ఇద్దరు హీరోయిన్లు బొద్దుగానే ఉండి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ విధంగా అభిమానులను అలరించడానికి బొద్దుగా ఉంటేనే బాగుంటుందనే భావనలో హీరోయిన్లు ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Latest news