హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో విషాదం.. సంధ్య అనే విద్యార్థిని..

-

హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని సంధ్య అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సంధ్య తీగల రాంరెడ్డి పాలిటెక్నిక్‌ కాలేజీలో చదువుకుంటోంది. అయితే లెక్చరర్‌ పార్వతి వేధింపులతోనే తమ కూతురు బలవన్మరణానికి పాల్పడిందని సంధ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

టీఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలలో మూడవ సంవత్సరం చదువుతున్న సంధ్యను మేనేజ్‌మెంట్ గత కొన్ని రోజులుగా వేధింపులకు గురుచేస్తున్నట్లుగా ఆమె స్నేహితులు కూడా తెలిపారు. దీంతో కాలేజ్‌ గేట్‌ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు విద్యార్థులు. సంధ్య మృతిపై కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news