టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి కిడ్నాప్ !!

-

కరాటే కళ్యాణి తల్లి విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరాటే కళ్యాణి మరియు మౌక్తిక నిన్న వెళ్లారు.. ఎక్కడికి వెళ్ళారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు..నిన్నటి నుండి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని.. నా కూతురు పై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. తమ దగ్గర డబ్బులు తీసుకొని మాపైనే ఆరోపణలు చేస్తున్నారని… శ్రీకాంత్ రెడ్డి నా కూతురు పై అటాక్ చేస్తానని బెదిరించాడని వెల్లడించారు.

నిన్నటి నుండి కూతురు కళ్యాణి, పాపా మౌక్తిక ను ఎవరు తీసుకొని వెళ్లారో…వారు ఎక్కడ ఉన్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వాళ్లను కిడ్నాప్‌ చేశారని ఆరోపణలు చేశారు కరాటే కళ్యాణి తల్లి విజయలక్ష్మి. నిన్న చైల్డ్ వెల్ఫర్ వారు వచ్చారు..చిన్న పిల్లలను అక్రమంగా తీసుకొని వచ్చారా అని మమ్మల్ని ప్రశ్నించారన్నారు. నిజానిజాలు వెల్ఫేర్ అధికారులకు తెలియచేసాము…కల్యాణి, 5 నెలల పాపా ఎక్కడ ఉన్నారో వివరాలు తెలియజేయాలి అని కోరుతున్నానని వెల్లడించారు కరాటే కళ్యాణి తల్లి విజయలక్ష్మి.

Read more RELATED
Recommended to you

Latest news