ఆమెతో ఎఫైర్ వల్లే భర్తని దూరం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..!

-

ప్రముఖ బాలీవుడ్ నటి అందాల తార నాటితరం యువత కలల రాకుమారి రేఖ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందానికి నిలువుటద్దంగా మారిన రేఖ సౌత్ సినిమాలలో నటించి ఆ తర్వాత దక్షిణాదిని వదిలి ఉత్తరాదికి వెళ్ళిపోయిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడ ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఇకపోతే ఈమె అందానికి మంత్రముగ్ధులవని నటీనటులు లేరనే చెప్పాలి. ఇక అలా ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎఫైర్ లిస్టులు ఉన్నాయని చెప్పవచ్చు.

ప్రముఖ క్రికెటర్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో ప్రేమలో పడింది అంటూ వార్తలు బాగా వైరల్ అవ్వగా వీరిద్దరూ చట్టపట్టలేసుకొని తిరిగారని.. పెళ్లి కూడా చేసుకుంటారు అనుకునే లోపే విడిపోయారు. మరొకవైపు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కూడా ప్రేమాయణం నడిపింది. మధ్యలో ఆయన భార్య జయాబచ్చన్ కఠినంగా ప్రవర్తించే సరికి వీరి ప్రేమకు బ్రేక్ పడింది. పెళ్లికాకముందే నుదుటున సింధూరం ధరించడం చూసి వినోద్ మెహ్రాను రహస్యంగా పెళ్లి చేసుకుందని.. అతడితో సెట్ అవ్వకపోవడం వల్ల దూరంగా వచ్చేసిందన్న ప్రచారం కూడా జరిగింది.

ఇక తర్వాత కొద్ది రోజులకు పార్టీలలో కలిసినప్పుడు వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్ పెళ్లి చేసుకుందామా అని అడగ్గా.. వెంటనే సరే అన్న రేఖ ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన ఏడు నెలలకే రేఖ చున్నీతో ముఖేష్ ఉరేసుకొని మరణించడం నిజంగా బాధాకరమని చెప్పాలి. అయితే రేఖ భర్త ముఖేష్ మరణించడానికి కారణం రేఖ పర్సనల్ సెక్రెటరీ ఫర్జానా అని చెబుతూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని ప్రముఖ రచయిత యాజీర్ ఉస్మాన్ రేఖ జీవిత కథను రాసేటప్పుడు అందులో పొందుపరిచారు. రేఖ ఆమెతో సహజీవనం చేసిందని.. అందుకే రేఖ భర్త మరణించారని ఆయన తన పుస్తకంలో పొందుపరిచారు. కానీ ఈ విషయంపై రేఖ మాత్రం స్పందిస్తూ ఆమెను తన సొంత సోదరిలా భావిస్తానని చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news