ఏపీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..త్వరలోనే 1500 బస్సులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రయాణికులకు గుడ్ న్యూస్. ప్రజా రవాణాను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 1500 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచినట్లు సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

అదేవిధంగా 250 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అద్దె బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news