రెండో పెళ్లి విషయంలో ట్రోల్స్‌.. స్పందించిన దిల్‌ రాజు

-

తన రెండో పెళ్లి, పర్సనల్ లైఫ్ పై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. ట్రోల్స్‌ గురించి ఆలోచించకూడదని అన్నారు. పరుశురామ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ విడుదల సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ట్రోల్స్‌పై స్పందించారు.

తనకు గతంలో అసలు మీమ్స్‌ గురించి అవగాహన లేదని, తన పెళ్లి తర్వాత ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. అందులో తన భార్యను ఎలా కలిశాను..తమ జర్నీ ఎలా మొదలైందో చెప్పానని అన్నారు. ఆ వీడియోపై ట్రోల్స్‌ చేస్తే.. అవి తన భార్య చూపించిందని తెలిపారు. అయితే తాను వాటి గురించి పట్టించుకోనని, తెలుగు రాష్ట్రాల్లో తనను గుర్తుపట్టేవారు కోటి మంది ఉంటారని, తనపై కామెంట్స్‌ చేసేవాళ్లు పదివేల మంది ఉంటారంతేనని అన్నారు. ఇలా ట్రోల్స్‌, నెగెటివ్ కామెంట్స్‌ చేసేవాళ్ల గురించి పట్టించుకుంటే తాను మిగతా వాళ్లకు దూరమవుతానని, అందుకే తాను అలాంటి వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచించనని చెప్పుకొచ్చారు. ‘నేను ఆకాశం లాంటివాడిని. అవేమైనా చంపేస్తాయా.. చంపలేవు కదా! అలాంటి మేఘాలన్నీ వెళ్లిపోయాక మనకు ఆకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది’ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news