ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ప్రముఖ తెలుగు హీరో మహేష్ బాబు లేఖ రాశారు. షూటింగ్ కారణంగా రేపు విచారణకు హాజరు కాలేకపోతున్నానని.. తనకు మరో డేట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న #SSMB29 సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో కొనసాగుతోంది. ఈ క్రమంలో తనకు మరో అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ కంపెనీకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ కంపెనీ ప్రమోషన్ కోసం మహేష్ బాబు రూ.5.90 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. మనీ లాండరింగ్ పాల్పడిన ఈ కంపెనీలలో పెట్టుబడులు పెట్టేలా ప్రజలను ప్రభావితం చేశారని.. ఆ ప్రమోషన్ల పేరుతో భారీగా డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలోనే ఈ నెల 22న మహేష్ బాబుకి ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసుల ప్రకారం.. సోమవారం ఉదయం 10.30 గంటలకు బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయానికి మహేష్ బాబు విచారణకు హాజరు కావాల్సి ఉంది.