దాని కోసమే.. అంటూ మూడో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన వనిత విజయ్ కుమార్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మూడు పెళ్లిళ్లతో నరేష్ ఏ విధంగా పాపులారిటీ దక్కించుకున్నారో.. నటి వనిత విజయ్ కుమార్ కూడా మూడు పెళ్లిళ్లు అంటూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది మే నెలలో ఆమె మూడవ భర్త పీటర్ పాల్ మరణించాడు. అయితే అతను తన భర్త కాదు అని అసలు పీటర్ కి తనకు పెళ్ళే జరగలేదని అప్పట్లో వనిత పోస్ట్ కూడా పెట్టింది. అయితే అందరూ దీనిపై ఆశ్చర్యపోతూ పెళ్లి చేసుకున్నారు కదా అంటూ కామెంట్లు కూడా చేశారు. అయితే అప్పుడు మౌనంగా ఉన్న వనిత ఇప్పుడు వీటిపై క్లారిటీ ఇచ్చింది.

వనిత విజయ్ కుమార్ మాట్లాడుతూ..లాక్ డౌన్ వల్ల నాలో ఒత్తిడి బాగా పెరిగిపోయింది.. చనిపోతానేమో అని అనుకున్నాను.. అందుకే నాకు ఎవరైనా తోడు కావాలని అనిపించింది. ఒకవేళ నేను చనిపోయిన సరే అప్పటి వరకు నాకు తోడుంటారు కదా.. అయితే నేను మూడో పెళ్లి చేసుకోవడం కూడా తప్పు కాదు.. అలాగని పీటర్ ను నేను మూడో పెళ్లి చేసుకోలేదు.. అతడు మంచి వ్యక్తి మాత్రమే.. అతడి వల్ల జీవితంలో ఎన్నో విషయాలను నేను నేర్చుకున్నాను.నా వరకు చూసుకుంటే అసలు పీటర్ పాల్ కి, నాకు పెళ్లి జరగలేదు. కేవలం నిశ్చితార్థం మాత్రమే చేసుకున్నాము . కొన్నాళ్లకు నేను జీవితాన్ని కోరుకున్నాను.

కానీ అతను తన దారి ఎంచుకున్నారు. నా వరకు వస్తే ప్రేమ అనేది చాలా ముఖ్యం.. అయితే అది ఒక వైపు నుంచి మాత్రమే వస్తే ఎలా.. నేను ప్రేమ చూపించినప్పుడు అటువైపు నుంచి కూడా అంతే ప్రేమను ఆశిస్తాను కదా.. ఆ ప్రేమ కోసమే నేను పీటర్ పాల్ తో నిశ్చితార్థం జరుపుకున్నాను.. కానీ అది దొరకలేదు.. అందుకే నేను మళ్ళీ అతడిని పెళ్లి చేసుకోలేదు అంటూ తెలిపింది వనిత విజయ్ కుమార్.. ఇకపోతే నరేష్, పవిత్ర లోకేష్ మళ్లీ పెళ్లి సినిమాలో రమ్య రఘుపతి క్యారెక్టర్ వనిత పోషించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news