కొత్త ట్రెండ్ క్రియోట్ చేయడానికి రెడీ అయిన వరలక్ష్మి శరత్ కుమార్ ..!

-

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం క్రాక్‌. డాన్‌ శీను, బ‌లుపు లాంటి సినిమాల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ కోసం రూపొందిస్తున్నారు. వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ సక్సస్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు. గతంలోను వరసగా ఫ్లాప్స్ వస్తున్న సమయంలోనే రవితేజతో బలుపు సినిమా చేసి హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు.

 

ఇక ఇప్పటికే పోస్టర్స్ ట్రైలర్స్ తో సినిమా మీద అంచనాలు భారీగానే నెలకొన్నాయి. జూలై లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. శృతిహాసన్ చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే రవితేజ తో శృతిహాసన్ బలుపు సినిమాలో నటించి హిట్ అందుకుంది. దాంతో ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందన్న నమ్మకంతో కూడా ఉన్నారు.

ఇక ఈ సినిమాలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి టాలీవుడ్ సినిమాలలో నటించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వరలక్ష్మి హీరోయిన్ గా కాదు లేడీ విలన్ గా కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. లేడీ విలన్ అన్న పేరు సంపాదించుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఇప్పటికే తమిళంలో పందెంకోడి – విజయ్ సర్కార్ సినిమాలలో వరలక్ష్మి విలనిజం బాగా పాపులారిటిని సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు.

ఇక అప్పటినుండి వరలక్ష్మిని ఎక్కువగా లేడీ విలన్ పాత్రలే ఎక్కువగా మేకర్స్ ఆఫర్ చేస్తున్నారు. తెలుగులో ఇప్పటికే తెనాలి రామకృష్ణ సినిమాలో లేడీ విలన్ గా నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి వరలక్ష్మి చాలా పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతుందట. అది కూడా రవితేజ క్రాక్ సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టడానికి అది కూడా రవితేజ నే ఢీ కొట్టడానికి సిద్దమవుతుందట. మొత్తానికి అందరూ హీరోయిన్స్ గా పాపులారిటి కోసం తాపత్రయపడుతుంటే వరలక్ష్మీ మాత్రం కొత్త ట్రెండ్ క్రియోట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news