సాయిపల్లవితో మళ్లీ అందుకే నటించలేదు : వరుణ్ తేజ్

-

ఫిదా మూవీతో హిట్ జోడీగా నిలిచారు వరుణ్ తేజ్, సాయి పల్లవి. ఈ సినిమాలో ఈ జంటను చూసి ప్రేక్షకులు తెగ ఫిదా అయిపోయారు. వీరిద్దరి కాంబో అద్దిరిపోయిందంటూ మరోసారి వీళ్లు కలిసి నటిస్తే చూడాలని ఎంతో ఉవ్విళ్లూరిపోయారు. కానీ వీరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు మరో చిత్రం రాలేదు. అయితే వీరిద్దరూ కలిసి నటించేలా మరో కథ తమ వద్దకు వచ్చినా కావాలనే కలిసి చేయలేదని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. సాయి పల్లవితో కలిసి మరోసారి నటించకపోవడానికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

‘‘మా కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందించేందుకు సన్నాహాలు జరిగాయి. ఆ మేరకు ఇద్దరం కథ విన్నాం. కానీ, ఈసారి చేస్తే ‘ఫిదా’ను మించి ఉండాలని, లేదంటే చేయకూడదని నిర్ణయించుకున్నాం. అందుకే మళ్లీ కలిసి నటించలేకపోయాం’’ అని వరుణ్ అసలు సంగతి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.  మార్చి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Read more RELATED
Recommended to you

Latest news