బన్ని, వెంకీ.. త్రివిక్రం ఓటెవరికి..?

-

అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత త్రివిక్రం చేస్తున్న అరవింద సమేత మీద భారీ హోప్స్ ఉన్నాయి. ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, ఈషా రెబ్బలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రం ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ఇంట్రెస్టింగ్ న్యూస్ అయ్యింది. అసలైతే వెంకటేష్, అల్లు అర్జున్, మహేష్ లు త్రివిక్రం తో సినిమాకు రెడీ అంటున్నారు.

అరవింద సమేత అనుకున్న అంచనాలను అందుకుంటే అల్లు అర్జున్ తోనే త్రివిక్రం తర్వాత సినిమా ఉంటుందట. ఇక సినిమా రిజల్ట్ తేడా కొడితే వెంకటేష్ తో డిఫరెంట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. చూస్తుంటే ఎన్.టి.ఆర్ సినిమా రిజల్ట్ మీదే త్రివిక్రం తర్వాత సినిమా ఆధారపడి ఉందని చెప్పొచ్చు.

మహేష్ తో కూడా సినిమా ప్లాన్ చేసినా ప్రస్తుతం వరుస సినిమాతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ త్రివిక్రంకు ఇప్పుడప్పుడే ఛాన్స్ ఇచ్చే పరిస్థితులు కనబడటం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version