F2 సీక్వెల్ ఫై వెంకటేష్ సంచలన కామెంట్స్….!!

-

విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా గత ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన కామెడీ ఎంటర్టైనర్ సినిమా F2 ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లు గా తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. అంతకముందు మంచి కమర్షియల్ ఎంటెర్టైనర్లు చేసి ప్రేక్షకులను అలరించిన అనిల్ రావిపూడి, తొలిసారిగా ఈ సినిమాతో పూర్తి కామెడీ ఎంటర్టైనర్ ని తెరకెక్కించారు.

Mehreen Pirzada, Varun Tej, Venkatesh, Tamannaah in F2 Movie 50 Days Posters HD

భార్య భర్తల మధ్య వచ్చే చిన్నపాటి గొడవలను పెద్దగా పట్టించుకోకుండా,ఎప్పటికప్పుడు వాటిని సరిచేసుకుంటూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపాలని తెలిపే మంచి సందేశంతో తెరకెక్కిన ఈ సినిమా ఓవర్ ఆల్ గా 78 కోట్ల రూపాల వరకు కొల్లగొట్టింది. మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా కలెక్షన్ అదరగొట్టిన ఈ సినిమాకు సీక్వెల్ తీస్తాను అని అప్పట్లో దర్శకుడు అనిల్ చెప్పడం జరిగింది. ఇక నిన్న జరిగిన ఒక ఇంటర్వ్యూ లో భాగం మాట్లాడిన విక్టరీ వెంకటేష్, అతి త్వరలోనే F2 కి సీక్వెల్ గా F3 రానుందని,

 

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా పనులతో బిజీగా ఉన్న దర్శకుడు అనిల్, ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పై త్వరలో పనిచేయనున్నారని, అలానే ఈ సినిమాలో తనతో పాటు మరొక్కసారి వరుణ్ తేజ్ కూడా నటించబోతున్నట్లు వెంకీ చెప్పారు. అయితే హీరోయిన్లుగా తమన్నా, మెహ్రీన్ నటిస్తారా లేక వారి స్థానంలో మరొకరు ఉంటారా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం అని, అలానే ఈ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కనున్నట్లు ఆయన చెప్పారు. ఇక ఈ వార్తతో వెంకీ, మెగా ఫ్యాన్స్ మరొక్కసారి పండగ చేసుకుంటున్నారు. అలానే F2 ని మించేలా తప్పకుండా ఈ సినిమా మరింత గొప్ప ఎంటర్టైనర్ గా ఉంటుందని కూడా వెంకీ అన్నారు….!!

Read more RELATED
Recommended to you

Latest news