కేరళకు విజయ్ సాయం అంతా ఉత్తుత్తేనా..!

-

దాదాపు పదిరోజులు పైగా వర్షంతో.. వరదలతో కేరళ మొత్తం దారుణమైన పరిస్థితుల్లో ఉంది. అయితే స్టార్ సెలబ్రిటీస్ అంతా కేరళకు మేమున్నాం అంటూ విరాళాలు ప్రకటిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, చరణ్, అల్లు అర్జున్, మహేష్. నాగార్జున ఫ్యామిలీ కేరళ బాధితులకు విరాళాలు ప్రకటించగా కోలీవుడ్ నుండి సూర్య బ్రదర్స్, విజయ్ సేతుపతి, ధనుష్, రజిని, కమల్ హాసన్ ఇలా అందరు తమ వంతు సాయాన్ని ప్రకటించారు.

అందరిలో కన్నా కోలీవుడ్ ఇళయదళపతి విజయ్ ఏకంగా 14 కోట్లు విరాళం ఇచ్చాడన్నది హాట్ టాపిక్. విజయ్ ది ఎంత గొప్ప మనసు అని అందరు గొప్పగా భావించారు. అయితే విజయ్ కాని ఆయన పి.ఆర్ టీం కాని ఈ విషయంపై నోరు విప్పలేదు. సో ఫైనల్ గా ఇదో ఫేక్ న్యూస్ అని తేలింది.

కేరళకు ఇంకా విజయ్ ఎలాంటి విరాళం ప్రకటించలేదు. కేవలం అతని ఫ్యాన్సే విజయ్ 14 కోట్ల విరాళం ఇచ్చాడని న్యూస్ స్ప్రెడ్ చేశారు. నిజంగానే విజయ్ అంత సాయం చేశాడని అందరు అతన్ని మెచ్చుకున్నారు కాని అదంతా ఉత్తుత్తే అని తేలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version