పుల్వామా దాడి.. వారికి మనమున్నామని చెబుదాం : విజయ్ దేవరకొండ

-

పుల్వామా ఉగ్రదాడితో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కి పడ్డది. టెర్రరిస్టుల దొంగ దెబ్బ వల్ల 40 మంది భారత సైనికులు నేలకొరిగారు. ఈ దుశ్చర్యపై భారత ప్రజలు దిగ్బ్రాంతికి గురయ్యారు. మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేయాల్సిందే అని చెబుతున్నారు. ఇక ఈ సంఘటన మీద సెలబ్రిటీస్ కూడా తమ స్పందన తెలియచేయగా వారిలో విజయ్ దేవరకొండ మాత్రం సోల్జర్ వెల్ఫేర్ కోసం ఫండ్ పంపించాడు.

ఇండియా బ్రేవ్ హార్ట్ కు విజయ్ దేవరకొండ కొంత మొత్తం సాయం చేశాడు. అయితే తను మాత్రమే కాదు తన ఫ్యాన్స్ ను ఎవరికి తోచినంత వారు సాయం చేయాలని అన్నారు. మన కుటుంబాలను రక్షిస్తున్న సైనిక కుటుంబాలని రక్షించే బాధ్యత మనదని విజయ్ చెప్పుకొచ్చాడు. విజయ్ మంచి మనసుకి సిని ప్రేక్షకులు హ్యాట్సాఫ్ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version