మహేష్ కథ విజయ్ దగ్గరకెళ్లిందా..!

-

భరత్ అనే నేను తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా లైన్ లో పెట్టాడు మహేష్. సుకుమార్ మహేష్ కోసం పిరియాడికల్ కథ తెలంగాణా పోరాట నేపథ్యంలో లైన్ అనుకున్నాడట. అయితే ప్రస్తుతం పిరియాడికల్ మూవీస్ ఎక్కువవుతున్న ఈ టైంలో ఆ సినిమా అంత కిక్ ఇవ్వదని మహేష్ అభిప్రాయపడ్డాడట. అందుకే సుకుమార్ కు వేరే కథ ప్రిపేర్ చేయమని చెప్పాడట. అయితే తను రాసుకున్న కథ మీద ప్రేమను పెంచుకున్న సుకుమార్ ఆ కథను విజయ్ దేవరకొండ హీరోగా చేయాలని చూస్తున్నాడట.

మహర్షి అయ్యాక అంటే ఎలా లేదన్నా జూన్ వరకు మహేష్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ ఆరు నెలల్లో విజయ్ తో సినిమా తీసేయొచ్చని సుకుమార్ ఆలోచన. ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రేజ్ కూడా బాగుంది. అతన్ని వాడుకునేలా వాడుకుంటే అద్భుతాలే సృష్టించవచ్చని దర్శకులకు అర్ధమైంది. మరి సుకుమార్ కథకు విజయ్ ఓకే చేప్తాడా లేడా అన్నది తెలియాల్సి ఉంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. కాంతి మాధవ్ సినిమాను క్.ఎస్ రామారావు నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news