బుల్లితెరపై కూడా భయపెట్టడానికి సిద్ధమైన విరూపాక్ష..!

-

మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ దాదాపు యాక్సిడెంట్ తర్వాత ఒక రెండు సంవత్సరాలు విరామం తీసుకుని మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా థియేటర్లలో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.సాయి ధరమ్ తేజ్ హీరోగా మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన చిత్రం ఇది. ఈ సినిమాలో ఊహించిన విధంగా ట్విస్టులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వెండితెరపై ఊహించని విధంగా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు అంతకుమించి కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోయింది.

డైరెక్టర్ కార్తీక్ దండువర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సునీల్ , రాజీవ్ కనకాల, సోనియా సింగ్, రవి కృష్ణ , బ్రహ్మాజీ , శ్యామల తదితరులు కీలక పాత్రలు పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అటు ఓటీటీ లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా బుల్లితెర ఆడియన్స్ను అలరించడానికి అలాగే సస్పెన్స్ తో భయపెట్టడానికి సిద్ధమయ్యింది . ఇక త్వరలోనే స్టార్ మా లో సినిమా ప్రసారం కానుందని సమాచారం.

ఇదిలా ఉండగా ఈ సినిమా డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం.. సాయిధరమ్ తేజ్, సంయుక్త నటనపై ప్రేక్షకులే కాదు సినీ విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈ సినిమా చివర్లో సంయుక్త నటన అద్భుతమని.. ఆమె తన పాత్రతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ప్రేక్షకులకు దాదాపు రెండున్నర గంటల పాటు థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించడంలో డైరెక్టర్ కూడా సక్సెస్ అయ్యారు అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news