వామ్మో.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖర్చు అన్ని కోట్లా..?

-

రామాయణ ఇతిహాస గాథ ను తెరపై అద్భుతంగా చూపించడానికి మన ముందుకు వస్తున్నారు బాలీవుడ్ బడా డైరెక్టర్ ఓం రౌత్, టాలీవుడ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు తాజాగా ఆది పురుష్ సినిమాతో తెరపైకి రాబోతున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈనెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమా పై ట్రైలర్ వల్ల భారీగా అంచనాలు నెలకొన్నాయి.

మొదట్లో ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైనప్పుడు ట్రోల్స్ ఎదుర్కొన్నప్పటికీ కూడా ట్రైలర్, పాటలు మాత్రం సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇటీవల జైశ్రీరామ్ అనే పాటను విడుదల చేయగా దేశవ్యాప్తంగా ఈ పాటకు భారీ రెస్పాన్స్ లభిస్తోంది. మరొకవైపు రీసెంట్గా విడుదలైన రామ్ సీతారాం పాటకి కూడా హ్యూస్ రెస్పాన్స్ దక్కడం గమనార్హం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తున్నారు .

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 6వ తేదీన తిరుపతిలో చాలా ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 200 మంది డాన్సర్లతో పాటు 200 మంది సింగర్లు కూడా రాబోతున్నారు. అంతేకాదు వీళ్లంతా కూడా ఒకేసారి స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అక్కడితో ఆగకుండా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణం మొత్తం కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సెట్టింగ్స్ వేస్తున్నారట ఇందుకోసం సుమారుగా మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగు రైట్స్ రూ.180 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news