ఏంటీ.. సమంత పక్కన కూర్చోవాలంటే అన్ని రూ.లక్షలు చెల్లించాలా..?

-

పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇటీవల యశోద, శాకుంతలం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి అనే సినిమా చేస్తోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. ఇప్పటికే విజయ్ దేవరకొండ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ ఒకటవ తేదీన గ్రాండ్గా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగంగా మొదలుపెట్టారు.

ఇకపోతే సమంత ఇటీవల అమెరికా వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. తాను గత కొంతకాలంగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో వైద్య చికిత్స కోసం ఆమె తన తల్లితో కలిసి అమెరికాకు వెళ్లారు. అయితే సమంత వెళ్ళింది ట్రీట్మెంట్ కోసం కాదని ఈనెల 20వ తేదీన అక్కడ జరగబోయే ఇండియా డే పరేడ్ కార్యక్రమంలో పాల్గొనడానికి అని తెలుస్తోంది. అంతేకాదు సమంత అక్కడ తన లేటెస్ట్ మూవీ ఖుషి సినిమా ప్రమోషన్స్ ని కూడా నిర్వహిస్తోందట. ఇదిలా ఉండగా అక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొనింది. అయితే ఆ ఈవెంట్లో సమంత పాల్గొన్నందుకు ఆమెకు అక్షరాలా రూ .30 లక్షలు చెల్లించారట నిర్వాహకులు.

ఈ క్రమంలోనే ఆ ఈవెంట్లో పాల్గొనే వారికి నిర్వాహకులు టికెట్ల ధర రూ.12 వేల నుంచి రూ.2 లక్షల వరకు నిర్ణయించారట. అయితే రెండు లక్షల రూపాయల టికెట్ కొనుగోలు చేసిన వారికి సమంతకు దగ్గరగా కూర్చునే అవకాశం ఉంటుందట. ఇందుకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version